చంద్రబాబుపై నాన్ బెయిల్ కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కర్నూలు పోలీసులు..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్నూలులో ఎన్ 440 కే వైరస్ ఉందని చంద్రబాబు ప్రచారం చేయడంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కర్నూలుకు చెందిన న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చంద్రబాబు నాయుడుపై ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద నాన్ బెయిల్ కేసు నమోదు చేశామని కర్నూలు పోలీసులు పేర్కొన్నారు. 

Leave a Comment