వెళ్లి పడుకో.. సిగ్గుండాలి.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి హీరో సిద్ధార్థ్ కౌంటర్..

బీజేపీ నేతలపై హీరో సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవల బీజేపీ నేతల నుంచి తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని కూడా సిద్ధార్థ్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆరోపణలు చేశారు.

 అయితే హీరో సిద్ధార్థ్ తమిళనాడు బీజేపీ నేతలనే కాకుండా కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్యపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. తేజస్వీని టెర్రరిస్టుతో పోల్చాడు. దీంతో సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణు వర్ధర్ రెడ్డి మండిపడ్డాడు. సిద్ధార్థ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు. 

ఏపీ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డికి నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్నులు కడుతున్నానని చెప్పాడు. ‘లేదు రా. అతడు నా టీడీఎస్ కట్టేందుకు రెడీగా లేడు. నేను పర్ఫెక్ట్ సిటిజన్. ట్యాక్స్ పేయర్ ను కదరా విష్ణు.. వెళ్లి పడుకో.. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట.. సిగ్గుండాలి’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు..

Leave a Comment