సీఎం జగన్ పెద్ద గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు.. ఉండవల్ల ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పెద్ద గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పెద్ద క్విడ్ ప్రోకోను అమలు చేస్తున్నారని అన్నారు. 

సీఎం జగన్ పక్కా బిజినెస్ మెన్ అని, ఆయన ఏం చేసినా వ్యాపారాత్మకంగా ఆలోచించే చేస్తారని ఉండవల్లి పేర్కొన్నారు. జగన్ ఒక పక్క డబ్బులు ఇస్తూ.. మరో వైపు పన్నుల రూపంలో లాగేసుకుంటున్నారని తెలిపారు. డబ్బు తీసుకున్న ఓటర్లందరూ తనతోనే ఉంటారని అనుకుంటున్నారని అన్నారు. ఎంత కాలం ఆయన బటన్ నొక్కి డబ్బులు ఇవ్వగలడనేది చెప్పలేమన్నారు. 

సీఎం జగన్ ఎవరి మాట వినరని, ఆయన చేస్తోంది తప్పు అని చెప్పే వారు లేరని ఉండవల్ల వెల్లడించారు. డబ్బులు పంచడం వల్ల ఆయన సక్సెస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? అనేది ఎవరూ చెప్పలేరన్నారు. డబ్బులు పంచుతున్నాను కదా.. తనకే అందరూ ఓటు వేస్తారని జగన్ అనుకుంటున్నారని చెప్పారు. 

Leave a Comment