ప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఇంట్లో నుంచి పరారీ..

అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకోవడం సహజం.. కానీ ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనేది ప్రకృతికి విరుద్ధం.. అదే విదేశాల్లో అయితే ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలు పెళ్లిచేసుకోవడం మాములే.. కానీ ఇండియాలో అలా కుదరదు.. ఒప్పుకోరు కూడా..

కానీ కర్నూలు జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంతోష్ నగర్ కు చెందిన యువతి(21), నర్సింహా రెడ్డి నగర్ కు చెందిన యువతి(20) ఇంట్లో నుంచి పారిపోయారు. ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోతూ తల్లిదండ్రులకు సంక్షిప్త సమాచారం ఇచ్చారు. దీంతో ఇరువురి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి యువతుల కోసం దర్యాప్తు చేపట్టారు.  

Leave a Comment