కరోనా వ్యాప్తికి ట్రంప్ పర్యటనే కారణం

శివసేన నాయకుడు సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

గుజరాత్, ఢిల్లీ, ముంబైలలో కరోనా వ్యాప్తి చెందడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనే కారణమని శివసేన నాయకుడు సంయజ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.  ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ను స్వాగతించడానికి అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తికి ఈ పర్యటనే కారణమంటూ రౌత్ విమర్శించారు. 

లాక్ డౌన్ పై కూడా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ అమలు చేశారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం వల్ల గుజరాత్ లో కరోనా వ్యాప్తి చెందిందని అన్నారు. ట్రంప్ తో పాటు కొంత మంది ప్రతినిధులు ఢిల్లీ, ముంబైని కూడా సందర్శించారన్నారు. ఇది కరోనా వైరస్ వ్యాప్తికి దారి తీసిందని రౌత్ చెప్పారు. 

Leave a Comment