ట్రయాంగిల్ లవ్ స్టోరీ: లాటరీ పద్దతిలో యువతిని ఎంపిక చేసి పెళ్లి చేసిన పెద్దలు..!

ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడం లేదా ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేసి మరొకరితో పెళ్లి చేయడం.. ఇదంతా సినిమాల్లోని స్టోరీ.. అదే నిజజీవితంలో జరిగితే మాత్రం ఏం జరుగుతుందో ఊహించడం కష్టం.. అలాంటి ఘటన కర్నాటకలోని హసన్ జిల్లాలో వెలుగుచూసింది. 

ఇంతకు ఏం జరిగిందంటే.. సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించాడు. ఆ ఇద్దరు యువతులు కూడా ఆ యువకుడిని గాఢంగా ప్రేమించారు. ఓ రోజు విషయం ఇద్దరు అమ్మాయిలకు తెలిసింది. అయితే ఆ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు పోటీ పడ్డారు. అతడు నావాడంటే నావాడని పట్టుపడ్డారు. 

ఈ విషయం చివరికి పెద్దల దగ్గరకు తీసుకెళ్లారు.. ఈ లవ్ స్టోరీకి ఎలా పరిష్కరించాలో తెలియక పెద్దలు తలలు పట్టుకున్నారు. ఈక్రమంలో ఓ యువతి ఆ యువకుడు లేకుండా ఉండలేనంటూ విషం తాగింది. సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. కోలుకుని వచ్చాక ఈ ప్రేమకథ మరోసారి పెద్దల వద్దకు వెళ్లింది. ఇద్దరు యువతకులు కూడా మానవినడం లేదు. దీంతో ఈ ప్రేమకథకు వెరైటీగా ముగింపు పలికారు. 

ఏం చేశారంటే.. లాటరీ పద్ధతి ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని, ఇందులో పేరు రాని యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకూడదని షరతులు విధించారు. అనంతరం ఇద్దరు యువతుల సమ్మతితో లాటరీ తీశారు. అందులో విషం తాగిన యువతి పేరు వచ్చింది. పెద్దలు ఆ యువకుడితో ఆమె వివాహం చేశారు. లాటరీలో విఫలమైన యువతి చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయింది. నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరికి పుల్ స్టాప్ పడింది. 

Leave a Comment