టోక్యో ఒలింపిక్స్ లో తెలుగుతేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ లో సింధు ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ ప్టేయర్ తైజు యింగ్ చేతిలో 21-18, 21-12 స్కోర్ తో సింధు మ్యాచ్ కోల్పోయింది. దీంతో సింధు గోల్డ్ ఆశలు ఆవిరయ్యాయి.
కాంస్యం పైనే ఆశలు:
టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు భారత్ కు స్వర్ణం తీసుకొస్తుందన్న ఆశలు గల్లంతయ్యాయి. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన ఇండియన్ బ్యాడ్మింటన్ సెన్సేషన్ వీపీ సింధు సెమీస్ లో ప్రపంచ నంబర్ వన్ తైజు యింగ్ ముందు తలవంచింది. వరుసగా రెండు సెట్లను కోల్పోయి నిరాశపర్చింది. దీంతో సింధుకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే కాంస్యం కోసం చైనా షట్లర్ హి పింగ్ జియావోతో సింధూ పోటీపడనుంది.