నా తుది శ్వాస వరకు పేదలకు సాయం చేస్తా.. సోనూ సూద్ ప్రతిజ్ఞ..!

కరోనా కష్టకాలంలో తన సేవాకార్యక్రమాలతో రియల్ హీరో అయ్యారు సోనూసూద్.. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోనూసూద్ ను కలిసేందుకు అభిమానులు క్యూకట్టారు. సోనూసూద్ కు బర్త్ డే విషెస్ తెలిపేందుకు దేశ నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.  ఆయన ఇంటిముందు బాణా సంచా, పాటలు, కేకులతో సందడి చేశారు. 

ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన అభిమానులు అందరినీ సోనూసూద్ పలకరించారు. తనకు విషెస్ చెప్పిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘నా తుది శ్వాస వరకు నా శక్తిమేరకు పేదవారికి సేవ చేస్తానని పుట్టినరోజు సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. తనను కలిసిందుకు వచ్చిన అభిమానులతో సోనూసూద్ కలిసిన వీడియోను షేర్ చేశారు. 

  

Leave a Comment