ఈ ఫొటో ఆ ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది..!

తృణముల్ కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఆమెకు నిద్ర లేకుండా చేస్తోంది.. ఆమె త్రిశూలం పట్టుకుని దుర్గామాత రూపంలో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నుస్రత్ జహాన్ కు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి. ఓ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లినా ఆమెను అక్కడ కూడా బెదిరింపులు వెంటాడుతున్నాయి. 

అవి కూడా బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ‘నీ అంతం సమీపించింది. మరణించిన తర్వాత మాత్రమే నువ్వు నీ తప్పును తెలుసుకుంటావు’ అని కామెంట్లు వస్తున్నాయి. మీ మరణ సమయం వచ్చేసింది.. మీరు అల్లాహ్ కు భయపడుతున్నారు.. కానీ మీ శరీరాన్ని కప్పి ఉంచడం లేదు..మీకు సిగ్గు ఉండాలి..అంటూ మరో కామెంట్ వచ్చింది. ఇంకా కొందరు దుర్బాషలాడుతూ, చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. వెంటనే విషయాన్ని ఆమె పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా పంపింది. దీంతో బెంగాల్ ప్రభుత్వం ఆమెకు లండన్ లో అదనపు భద్రతను కల్పించింది.

 

Leave a Comment