తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. మార్చి 30 వరకు నామినేషన్లకు తుది గడువు ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 17న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఉప ఎన్నికల షెడ్యూల్ ఇదే..
మార్చి 23 – నోటిఫికేషన్
మార్చి 30 – నామినేషన్ల స్వీకరణ
మార్చి 31 – నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 3 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.
ఏప్రిల్ 17 – పోలింగ్
మే 2 – ఎన్నికల ఫిలితాలు