తల్లి చనిపోయిందని తెలీక.. నాలుగు రోజులు అమ్మ పక్కనే నిద్రించిన బాలుడు..!

ఆ బాలుడికి తల్లి చనిపోయిందన్న విషయం తెలీక నాలుగు రోజుల పాటు అమ్మ పక్కనే నిద్రించాడు.. అమ్మ నిద్రపోతుందని భావించి.. రోజూ స్కూల్ కి వెళ్తున్నాడు.. అమ్మను డిస్టర్బ్ చేయడం ఎందుకని తిను బండారాలను బాక్స్ లో పెట్టుకుని వెళ్తున్నాడు.. చివరికి మేనమామకు ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది..ఈ హృదయ విదాకరమైన ఘటన తిరుపతిలోని విద్యానగర్ కాలనీలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు తిరుపతి విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో రాజ్యలక్ష్మీ(41) నివాసం ఉంటోంది. నాలుగేళ్ల క్రితం భర్తతో విడిపోయి.. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ తన 10 ఏళ్ల కుమారుడు శ్యామ్ కిశోర్ ని చదివించుకుంటోంది.. ఈనెల 8న రాజ్యలక్ష్మికి వాంతులయ్యాయి. నీరసంగా ఉండటంతో కొంతసేపు నిద్రిస్తానని, తనను లేపే ప్రయత్నం చేయవద్దని ఆ తల్లి కుమారుడికి చెప్పింది. 

అలా నిద్రించిన రాజ్యలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. అమ్మ నిద్రిస్తుందని భావించిన పదేళ్ల బాలుడు శ్యామ్ కిశోర్ గత నాలుగురోజులుగా యధావిధిగా స్కూల్ కి వెళ్తూ వస్తున్నాడు. రోజూ ఇంట్లోని తినుబండారాలతో కాలం గడిపాడు. అమ్మ పక్కనే నాలుగురోజులు నిద్రించాడు.

నాలుగు రోజుల తర్వాత శవం నుంచి దుర్వాసన రావడంతో.. శుక్రవారం మేనమామ దుర్గాప్రసాద్ కి ఫోన్ చేశాడు. అమ్మ మూడు రోజులుగా నిద్రపోతుందని, ఇంట్లో వాసన వస్తుందని చెప్పాడు. దీంతో వెంటనే ఇంటి వద్దకు చేరుకున్న దుర్గాప్రసాద్ ఇంట్లో తన చెల్లిని చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.             

 

Leave a Comment