ముగ్గురు అక్కాచెల్లెళ్లకు భర్త ఒక్కడే..!

శోభా, రీనా, పింకీ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు..ఏం చేసినా కలిసే చేస్తారు. కలిసి డిగ్రీ పూర్తి చేశారు. వాళ్లు ఎప్పుడూ విడిగా ఉందామనుకోలేదు. అందుకే  ఒకేసారి పెళ్లిచేసుకున్నారు. అది కూడా ముగ్గురు కలిసి ఒక్కడినే పెళ్లిచేసుకుని సంతోషంగా ఉన్నారు. ఇది జరిగి 12 ఏళ్లు అవుతోంది. 

ఉత్తరప్రదేశ్ లోని చిత్రకోట్ కు చెందిన కృష్ణకు ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు. ఈ ముగ్గురికీ చెరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్లంతా కలిసి కంసీరామ్ కాలనీలో అన్యోన్యంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇన్నేళ్లయినా ఇప్పటి వరకు వారి కుటుంబంలో గొడవలు లేవు. 

అయితే కృష్ణ మరియు అతని భార్యలు తమ వివాహం గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కర్వా చౌత్ సందర్భంగా ముగ్గురు భార్యలు తమ భర్త సుఖ సంతోషాలు కోరుతూ ఉపవాసం ఉన్నారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేసి, చంద్రుడు వచ్చాక జల్లెడను తెరగా చేసుకుని ముగ్గురు ఒకేసారి భర్తను చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతుంది. 

 

Leave a Comment