విషాదం : ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ముగ్గురి మృతి

తమిళనాడులోని కరూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లే..కరూర్ జిల్లా రాయనూర్ లో ముత్తులక్ష్మీ అనే మహిళ రాత్రి సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోయింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ పేలింది. దీంతో ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలను అదపు చేశారు. 

కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తల్లితో పాటు పిల్లలు, రంజిత్, దక్షిత్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందటంతో రాయనూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెల్ ఫోన్లు వినియోగించే విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Leave a Comment