తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!

ఆగ్రాలోని తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ మహల్ వద్ద బాంబు పెట్టినట్లు గురువారం ఉదయం ఉత్తరప్రవేశ్ పోలీసుల హెల్ప్ లైన్ నెంబర్ కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని పర్యాటకులను ఖాళీ చేసి తాజ్ మహల్ ను మూసివేశారు. 

తాజ్ మహల్ వద్ద బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు పేలుడు పదార్ధాలు ఏవీ దొరకలేదని ఏడీజీ ఆగ్రా జోన్ రాజీవ్ క్రిష్ణ తెలిపారు. అది బూటకపు కాల్ అని, అయితే తమ తనిఖీలు కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. 

 

Leave a Comment