కూతురు ప్రేమించిందని ఆమె తల నరికి, చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు బయల్దేరాడు ఓ తండ్రి.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. కూతురు మీద అనుమానంతో కన్న తండ్రే ఈ ఘాతకానికి పాల్పడటం స్థానికంగా భయాందోళనకు గురిచేసంది.
వివరాల మేరకు పండేతారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తికి 17 ఏళ్ల కూతురు ఉంది. ఆమె గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. తన కూతురు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న కోపంతో సర్వేశ్ రగిలిపోయాడు. తన పరువు తీసిందంటూ పదునైన ఆయుధంతో ఆమెను నరికి చంపాడు.
ఆమె మొండెం నుంచి తలను వేరు చేసి రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నాడు. ఇది చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ప్రశ్నించగా.. అతడు ఏమాత్రం భయం లేకుండా సమాధానం ఇచ్చాడు.
‘ఇది నా కూతురి తలే.. నేనే చంపేశాను. ఈ హత్యలో ఇంకెవ్వరికీ సంబంధం లేదు. ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. నా పరువు తీసింది. అది భరించలేక నరికి చంపేశాను. ఈ తలను స్టేషన్ కే తీసుకొస్తున్నా.. మిగతా శరీరం ఇంట్లోనే ఉంది’ అంటూ చెప్పాడు. పోలీలసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టార.