తమిళ తంబిలకు చిన్నమ్మ షాక్.. రాజకీయాలకు గుడ్ బై..!

దివంగత అన్నా డీఎంకే నేత జయలలిత నెచ్చెలి శశికళ తమిళ ప్రజలకు షాకిచ్చారు. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చక్రం తిప్పుతారనున్న సమయంలో సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, తను దైవంగా పరిగణించే జయలలిత బంగారు పాలన కోసం దేవుడ్ని ప్రార్థిస్తానని ప్రకటనలో పేర్కొన్నారు.

 ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపుకోసం కార్యకర్తలు పోరాడాలని, తమ ప్రధాన శత్రువు డీఎంకేను ఓడించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. జయలలిత జీవించి ఉన్నప్పుడు అధికారం, హోదా కోసం తానెప్పుడూ ఆరాటపడలేదన్నారు. ఆమె మరణించిన తర్వాత కూడా అలాంటి పనులు చేయబోనని శశికళ స్పష్టం చేశారు.  

 

Leave a Comment