అమ్మవారికి దండంపెట్టి మరీ దొంగతనం చేసిన దొంగ.. వీడియో చూడండి..!

ప్రస్తుతం ఓ దొంగ చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. చేసేదే తప్పు.. అందులోనూ భక్తి చూపించాడు ఈ దొంగ.. అమ్మవారికి దండంపెట్టి మీర దొంగతనం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాలు మేరకు ఖమ్మంలోని 4వ డివిజన్ లో ఉండే అంకమ్మ ఆలయంలో అక్టోబర్ 31న దొంగతనం జరిగింది. 

రాత్రి సమయంలో ఓ దొంగ ఆలయం తలుపులు తెరిచి అమ్మవారి హుండీ పగలగొట్టి డబ్బులు దోచుకున్నాడు. అయితే అమ్మవారి మీద భక్తో లేక భయమో కానీ..దొంగతనం చేయడానికి ముందు అమ్మవారికి దండం పెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారం దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కొమ్ము భాస్కర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ దొంగ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

 

 

Leave a Comment