Viral Video: గుడిలో చోరీకి వచ్చి కిటికీలో ఇరుక్కుపోయాడు..!

గుడిలో చోరీకి వచ్చి కిటికీలో ఇరుక్కుపోయాడు ఓ దొంగ.. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిల్లాలోని కంచిలి మండలంలోని జాడుపూడి పరిధిలో జామి ఎలమ్మ గుడి ప్రసిద్ధి చెందినది. మార్చి నెలలో నిర్వహించే జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు..

ఈక్రమంలో పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి స్కెచ్ వేసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి తరువాత ఆలయం కిటికీ పగులగొట్టి లోపలకు దిగాడు. ఆలయంలోని హుండీలో ఉన్న కానుకలు తీసుకున్నాడు. కిటికీలో నుంచి గుడి లోపలికి వెళ్లిన దొంగ.. అంత ఈజీగా బయటకు రాలేకపోయాడు.. 

కిటికీ చాలా చిన్నదిగా ఉండటంతో మధ్యలో ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక.. లోపలికి వెళ్లలేక నానా తంటాలు పడ్డాడు. తెల్లవారుజాము వరకూ అలాటే ఉండాల్సి వచ్చింది. స్థానికులు గమనించి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అక్కడ ఉన్న వారు దీనిని వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

 

Leave a Comment