కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు నడపనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 15 రూట్లలో 30 రైళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి రైల్లే బోర్డు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
రైల్వే బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలు..
- ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మాత్రమే టికెట్ బుకింగ్ సౌకర్యం
- ఐఆర్సీటీసీ ఏజెంట్ల ద్వారా టికెట్ల బుకింగ్కు అను మతులు ఉండవు.
- ఏడు రోజుల ముందుస్తు రిజర్వేషన్కు మాత్రమే అనుమతి ఉంటుంది.
- కేవలం ఖరారైన టికెట్లు మాత్రమే జారీ చేస్తారు.
- వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ టికెట్లు జారీ చేయరు.
- ఆన్లైన్లో మాత్రమే టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం.
- టికెట్ను 24గంటల ముందుగా రద్దు చేసుకోవాలి. 50% రుసుము మాత్రమే తిరిగి చెల్లిస్తారు.
- రైళ్లలో ప్రయాణికులకు ఆహార పదార్థాలను సరఫరా చేసే బాధ్యత ఐఆర్సీటీసీదే.
- టికెట్ బుకింగ్ సమయంలోనే ఐఆర్సీటీసీలో ఆహారం బుక్ చేసుకునే సదుపాయం.
- గతంలో రాజధాని రైళ్లలో కల్పించిన దుప్పట్లు, టవల్స్ సరఫరాను ఈ ప్రత్యేక రైళ్లలో ఇవ్వడం లేదు