మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గత వారం ముగ్గురు వ్యక్తులపై జరిగిన ముఠా దాడిలో 101 మందిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్య చెప్పారు. అయితే వారిలో ఎవరూ కూడా ముస్లింలు లేరని స్పష్టం చేశారు.
ఈ ఘటనలో మతపరమైన రంగు ఆపాదించేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకుల ప్రయత్నాలను మంత్రి తిప్పికొట్టారు. ఈ కేసును మహారాష్ట్ర సీఐడీకు అప్పగించినట్లు ధ్రువీకరించారు.
గతవారం పాల్ఘర్ జిల్లాలోని గాడ్చిన్ చలే గ్రామానికి చెందిన కొందరు కర్రలు, రాళ్లతో ముగ్గరు వ్యక్తులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు సాధువులు ఉన్నారు. ఈ ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మతపు రంగు పులిమేందుకు ప్రయత్నించారు. సాధువులను ముస్లింలు చంపారని ఆరోపించారు.
అయితే ఈ దాడిలో ఒక్కరు కూడా ముస్లిం లేరని, ఇప్పటి వరకు 101 మందిని అరెస్టు చేశామని మంత్రి చెప్పారు. ఈ దాాడికి మతపరమైన రంగు ఇవ్వద్దని కోరారు. ఈ దాడిని హిందూ-ముస్లిం కోణంలో చూడద్దని సీఎం కార్యాయలం నుంచి కూడా ఒక ట్విట్ వచ్చింది.