ఎన్నికలకు అమరావతి గ్రామాలు దూరం

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో..రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్ కు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దిశగా చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలపాలని ప్రతిపాదన చేస్తోంది. అలాగే నీరుకొండ, నిడమర్రు, కురగల్లు, క్రిష్ణాయపాలెంతో పాటు తూళ్లూరు మండలంలోని గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్ గా చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. 

ఏపీ ఎన్నికల కమిషన్ కు ద్వివేది లేఖ..

మరో వైపు ఏపీ ఎన్నికల కమిషన్ కు పంచాయతీరాజ్, గ్రామాణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల క్రిష్ణ ద్వివేది లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహించని గ్రామాల పంచాయతీల వివరాలను జిల్లాల వారీగా లేఖలో ప్రస్తావించిన ద్వివేది.. ఆ గ్రామం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించొద్దని ఎన్నికల కమిషన్ ను కోరారు. అమరావతి రాజధాని పరిధిలో గ్రామాల్లోనూ పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 

Leave a Comment