రామ తీర్థంలో కోదండ రాముని విగ్రహం శిరస్సును ఎత్తుకెళ్లిన దుండగులు..!

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. బోడికొండపై ఉన్న కోదండ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహం తల భాగాన్ని తొలగించి ఎత్తుకెళ్లారు. నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు వచ్చిన దేవస్థాన అర్చకుడు ప్రసాద్ మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని తోటి సిబ్బందికి అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిసరాలను పరిశీలించారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.  

 

Leave a Comment