ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు..!

ఏపీ సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసింది. అయితే రఘురామకృష్ణంరాజు సీఐడీకి సహకరించాలని చెప్పింది. విచారణకు ఎప్పుడు పిలిచానా హాజరుకావాలని సుప్రీకం కోర్టు సూచించింది.

రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దీంతో పాటు బెయిల్ కు సంబంధించి, కస్టడీకి సంబంధించిన విషయాలపై మీడియా ముందుకానీ, సోషల్ మీడియాలో కానీ రఘురామకృష్ణంరాజు మాట్లాడకూడని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.  

కాగా రఘురామ బెయిల్ పిటిషన్ పై ఇరువైపులా పోటాపోటీగా వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆర్మీ రిపోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ సీఐడీ ఎంపీని సరిగ్గా ట్రీట్ చేయలేదన్న ప్రాథమిక సమాచారం, ఎంపీకి గుండె సంబంధిత సర్జరీ అయిన నేపథ్యంలో బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 

 

Leave a Comment