ఖతర్నాక్ దొంగలు.. పోలీస్ స్టేషన్ లోనే దోచేశారు..!

సామాన్యంగా ఇంట్లో దొంగలు పడటం చూశాం.. కానీ పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడటం ఎక్కడైనా చూశారా.. అలాంటి చోరీ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని వీరసావరంలో రెండు రోజుల క్రితం ఎక్సైజ్ సిబ్బంది రూ.8 లక్షలు నగదును పోలీస్ స్టేషన్ లో ఉంచారు. సోమ, మంగళవారాలు బ్యాంకులకు సెలువులు కావడంతో నాలుగు వైన్ షాపులకు చెందిన నగదును పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. మొత్తం నగదును లాకప్ లోని ఒక బాక్సులో ఉంచి తాళాలు వేశారు.  

బుధవారం బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ చేయాలని చూస్తే డబ్బు మాయమైంది. ఆ దొంగ ఎవరోకాని పోలీస్ స్టేషన్ పై గురి పెట్టి స్కెచ్ వేశాడు. రాత్రికి రాత్రి మొత్తం డబ్బును దొంగలించాడు. బాక్సు తాళాలు బద్దలు కొట్టి నగదు అపహరించి మళ్లీ తాళాలు వేశాడు. దీంతో పోలీసులు దొంగతనంపై కేసు నమోదు చేశారు. దొంగ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశమైంది.  

Leave a Comment