డేరింగ్ గర్ల్స్ : బుల్లెట్ మీద అమ్మాయిల స్టంట్.. రూ.28 వేలు జరిమాన..

బుల్లెట్ బైక్ పై ఇద్దరు అమ్మాయిలు డేంజరెస్ స్టంట్స్ చేశారు. కనీసం హెల్మెట్ కూడా ధరించకుండా  దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అది కాస్త పోలీసుల దృష్టికి పోయింది. హెల్మెట్ ధరించకపోవడం, అనుమతులు లేకుండా రేసింగ్ జరపడం సహా పలు డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించినందు పోలీసులు ఆ అమ్మాయిలకు భారీ జరిమాన విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. 

శివంగి దబాస్, రెజ్లర్ స్నేహ రఘువంశీ ఇద్దరు స్నేహితులు. ఘజియాబాద్ రోడ్డుపై స్నేహ రఘువంశీ తన స్నేహితురాలు శివంగి దబాస్ ను భుజాలపై కూర్చోబెట్టుకుని బైక్ నడిపింది. ఎదురుగా వాహనాలు వస్తున్నప్పటికీ ఏ మాత్రం బెరుకులేకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లారు. స్థానిక జిమ్ పేరుతో టీ-షర్టులు ధరించిన వీరిద్దరూ కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అది పోలీసుల దృష్టికి వెళ్లింది.

దీంతో రఘువంశీ తల్లి మంజూ దేవికి రూ.11 వేల చలానా పంపారు. బైక్ యజమాని అయిన సంజయ్ కుమార్ కు రూ.17 వేల ఫైన్ వేశారు. మొత్తంగా రూ.28 వేలు ఫైన్ వేశారు. ఆ ఇద్దరు యువతులకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు.  ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తమ జీవితాలను, ఇతరుల జీవితాలను ప్రమాదంలో నెట్టవద్దని పోలీసులు సూచించారు. 

 

Leave a Comment