కొడుకు చెంప దెబ్బకు ప్రాణాలు వదిలిన తల్లి.. వీడియో వైరల్..!

కన్న కొడుకు కొట్టిన చెంపదెబ్బకు వృద్ధురాలైన తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో అవ్ తార్ కౌర్ అనే 76 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు కోడలితో కలిసి నివాసం ఉంటుంంది. ఈనేపథ్యంలో సోమవారం పార్కింగ్ స్థలం గురించి కౌర్ కు, పక్కింటి వారికి మధ్య వివాదం జరిగింది.

 అది కాస్త ముదరడంతో పొరుగింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎందుకు గొడవపడ్డావని తల్లి కౌర్ పై కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో తల్లి చెంప మీద బలంగా కొట్టాడు. అంతే వృద్ధురాలు అక్కడే కుప్పకూలిపోయింది. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు కౌర్ కుమారుడు, పొరుగింటి వారి మీద కేసు నమోదు చేశారు. ఇది అక్కడ ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

Leave a Comment