సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోండి..!

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈపీఎఫ్, ఆధార్, పాన్ లింకింగ్, ఎల్పీజీ ధరలు, జీఎస్టీ, గూగుల్ యాప్స్ పర్మిషన్లలో మార్పులు జరగనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు ఏంటీ.. అవి ఎలా ప్రభావితం చేస్తాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈపీఎఫ్ అకౌంట్:

మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే సెప్టెంబర్ 1 వరకు ఆధార్ తో అనుసంధానం చేసుకోండి. లేకపోతే మీకు అందించే ఈపీఎఫ్ ప్రయోజనాలు తగ్గిపోవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఒ) ఆధార్ కార్డును పీఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. లింక్ చేయకపోతే మీ ఈపీఎఫ్ ఖాతాలో సంస్థ జమ చేసే నగదు జమ కాదు. 

ఆధార్- పాన్ లింక్:

మీరు ఆధార్-పాన్ అనుసంధానం చేయకపోతే వెంటనే చేసేయండి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు రూ.1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్-పాన్ లింక్ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉంది.   

ఎల్పీజీ సిలిండర ధరలు:

ప్రతి నెలా పెరుగుతున్ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి మారనున్నాయి. 

జీఎస్టీ నిబంధన:

జీఎస్టీఆర్-3బి రిటర్న్స్ ఫైల్ చేయని ట్యాక్స్ పేయర్లు జీఎస్టీఆర్-1 రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఆంక్షలు విధించే సెంట్రల్ జీఎస్టీ రూల్స్ లోని రూల్59(6) సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. వ్యాపారులు ఈ నెలకు సంబంధించిన జీఎస్టీఆర్-3బి వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఫైల్ చేయాలి. ఆ తర్వాత నెలలో జీఎస్టీఆర్-1 ఫైల్ చేయాలి. 

చెక్స్ క్లియరెన్స్:

చెక్ క్లియరెన్స్ కోసం ఆర్బీఐ పాజిటీవ్ పే సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్ధతి సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. భారీ మొత్తంలో చెక్స్ ఇచ్చే ముందు కస్టమర్లు  సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ పాటిటీవ్ పే సిస్టమ్ ను తీసుకొచ్చింది. 

సెబీ కొత్త నిబంధన:

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారికి పీక్ మార్జిన్ నార్మ్స్ అమలు చేయనుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నాలుగో దశ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

గూగుల్ యాప్స్:

గూగుల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాంటే సెప్టెంబర్ 1 నుంచి  కొత్త అనుమతులు ఉంటాయి. 

 

Leave a Comment