ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్‌ లో ..

రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు నమోcదైన కరోనా పాజిటివ్‌ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్‌ మండలాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయి. మండల కేంద్రం యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్లలో కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. రెడ్‌జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు ఒక్కటీ నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి మండలం చేరినట్లు ప్రకటిస్తారు.

రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలు :

కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నంద్యాల, బనగానపల్లి గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (పట్టణ), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (పట్టణ), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (పట్టణ)
నెల్లూరు (14): నెల్లూరు (పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు (పట్టణ), కావలి (పట్టణ), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు
గుంటూరు (12): గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల (పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి (పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ)
పశ్చిమగోదావరి (9): ఏలూరు (పట్టణ), పెనుగొండ గ్రామీణ, భీమవరం (పట్టణ), తాడేపల్లిగూడెం (పట్టణ), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (పట్టణ), నరసాపురం (పట్టణ)
ప్రకాశం (9): ఒంగోలు (పట్టణ), చీరాల (పట్టణ), కారంచేడు, కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం (పట్టణ), పొదిలి
తూర్పుగోదావరి (8): శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి (పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ), రాజమహేంద్రవరం గ్రామీణ
చిత్తూరు (8): శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు
కడప (7): ప్రొద్దుటూరు (పట్టణ), కడప (పట్టణ), బద్వేలు (పట్టణ), పులివెందుల (పట్టణ), మైదుకూరు (పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)
కృష్ణా (5): విజయవాడ (పట్టణ), పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట (పట్టణ), నూజివీడు (పట్టణ), మచిలీపట్నం (పట్టణ)
అనంతపురం (5): హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు
విశాఖపట్నం (3): విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం (పట్టణ). కేసులు నమోదైతే గ్రీన్‌జోన్‌ మండలం రెడ్‌జోన్‌లోకి వెళ్తుంది. ఈనెల 20 నుంచి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను జిల్లాల్లో అమలుచేయాలని కలెక్టర్లను కోరింది.

జిల్లా మొత్తాన్ని హాట్‌స్పాట్‌ అంటే ఎలా?

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కొవిడ్‌-19 హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జాతీయస్థాయిలో 6.2 రోజులకు కేసులు రెండింతలు అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో 2.5 రోజులు, గుంటూరు జిల్లాల్లో 3.3 రోజులు, చిత్తూరు జిల్లాలో 3.7 రోజులు, అనంతపురం జిల్లాలో 3.9 రోజుల్లో కేసులు రెండింతలు పెరిగినట్లు శనివారం వరకు నమోదైన గణాంకాల ఆధారంగా వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లోని జిల్లాల విస్తీర్ణం కంటే ఇక్కడ ఎక్కువగా ఉంది. జనాభా కూడా ఎక్కువే. ఈ పరిస్థితుల్లో మొత్తం జిల్లాను హాట్‌స్పాట్‌గా ప్రకటించడం భావ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది.

Leave a Comment