సోనూసూద్ ఆక్సిజన్.. ఏపీ నుంచే తొలి ప్లాంట్ ప్రారంభం..!

కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వారికి తనవంతుగా ఎంతో సాయం చేస్తున్నారు రియల్ హీరో సోనూసూద్.. ఇప్పటికే యూఎస్, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ సిలెండర్లను, వాటి తయారీ యంత్రాలను తీసుకొచ్చారు.. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసే పనిలో ఆయన టీమ్ నిమగ్నమైంది..

తాజాగా తాను తలపెట్టిన ఆక్సిజన్ ప్లాంట్లను ఎక్కడి నుంచి ప్రారంభిచేది ప్రకటించారు సోనూసూద్.. తొలి ఆక్సిజన్ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. ఆ తర్వాత నెల్లూరులో ప్లాంట్ ప్రారంభానికి శ్రీకారం చుడతారు.. 

 

Leave a Comment