ఆనందయ్యపై ఆర్జీవీ సెటైర్లు.. ఆనందయ్య కిడ్నాప్ కాకుండా చూడండి..!

ప్రస్తుతం దేశంలో కృష్ణపట్నం చర్చనీయాంశంగా ఉంది. కరోనాను నయం చేసేందుకు ఆనందయ్య అనే వ్యక్తి ఆయుర్వేద మందు అందిస్తున్నాడు. ఆనందయ్య ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నాడు. ఈనేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యపై సెటైర్లు వేశారు. 

ట్విట్టర్ వేదికగా ఆనందయ్యపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ‘ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ బయలుదేరారని తెలిసింది. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికై అయి ఉండొచ్చు.. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, సైనిక భద్రత కల్పించొచ్చుకదా’ అంటూ వ్యాఖ్యానించారు. 

‘ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్ నిపుణులే తమ ఫార్ములాను ఎవరికీ షేర్ చేయలేదు. అలాంటిది, ఆనందయ్య మాత్రం ఎవరు అడిగితే వారికి ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఆనందయ్యకు ఎట్టిపరిస్థితుల్లోనూ నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే’ అంటూ మరో ట్వీట్ చేశారు.  

‘హే ఆనందయ్య జీ.. నాకు నోరు, ముక్కు, చివరికి చెవులు కూడా బాగానే ఉన్నాయి. కానీ, కళ్లకు, ఊపిరితిత్తులకు ఉన్న సంబంధం ఏంటో అర్థమై చావట్లేదు. కాబట్టి, ప్రభుత్వ ఇక, భారత్ బయోటెక్, పునావాల, స్పుతినిక్ వ్యాక్సిన్ కు నిధులు ఇవ్వడం ఆపేసి, ఆ డబ్బు ఆనందయ్యకు ఇవ్వాలని కోరుతున్నా’

‘ప్రభుత్వానికి నా మనవి ఏమంటే.. ఆక్సిజన్ కొరతతో, బెడ్లు అందుబాటులో లేక జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఆనందయ్యకు సహకరించండి. ఆనందయ్య అయితే తేనె, వేపాకు గుజ్జు, బీట్ రూట్, వేరుశనగపప్పు, గడ్డి, ఉల్లిగడ్డలు.. ఇలా ఏవైనా సరే అన్నింటిని కలిపేసి ప్రజల జీవితాలను కాపాడేస్తారు’ అంటూ సెటైర్లు వేశారు ఆర్జీవీ..

Leave a Comment