ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కోటయ్య..!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే ఆయుర్వేద కరోనా మందు తీసుకొని కోలుకున్న విశ్రాంత హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం శనివారం ఉదయం క్షీణించిన విషయం తెలిసిందే.. దీంతో ఆయన నెల్లూరులోని ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. అయితే శనివారం సాయంత్రానికి ఆయన ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ అయయ్యారు..

ఆనందయ్య మందుతో కోలుకున్న కోటయ్య నాలుగు రోజుల వ్యవధిలో తిరిగి ఆస్వస్థతకు గురికావడంతో మందు పనితీరుపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. అయితే ఆయన సాయంత్రానికి కోలుకొని ఇంటికి చేరుకున్నారు. 

కళ్లు మంటలతో పాటు నీరసంగా ఉందంటూ కోట పీహెచ్సీకి వెళ్లారు కోటయ్య.. అక్కడ ఆయనకు ర్యాపిడ్ టెస్టు చేయగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయనే ఉద్దేశంతో నెల్లూరుకు తీసుకొచ్చారు. అయితే కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని, ఆక్సిజన్ 90 శాతం ఉందని ఆయన కుమార్తె చెప్పారు. నీరసంగా ఉండటంతో నెల్లూరుకు తీసుకొచ్చామని, ఆయన ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారని వెల్లడించారు.. 

Leave a Comment