చినిపోయిన బాలిక బ్రతికింది..మళ్లీ గంట తర్వాత చనిపోయింది…!

ఓ బాలిక చనిపోయింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు..అంతలోనే ఆ బాలిక బ్రతికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ అమ్మాయి బ్రతికినందుకు ఆమె కుటుంబ సభ్యుల్తో సంతోషం…అంతలోనే విషాదం…ఓ గంట తర్వాత ఆ బాలిక మళ్లీ చనిపోయింది.. ఈ వింత ఘటన ఇండోనేషియాలో జరిగింది. 

ఇండోనేషియా, ఈస్ట్ జావాకు చెందిన సితి మస్ ఫుఫాహ్ వర్దాహ్ అనే 12 ఏళ్ల బాలిక క్రోనిక్ డయాబెటీస్ తో ఈ నెల 18న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో సితి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఆమె శవానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహానికి స్నానం కూడా చేయించారు.

ఇక అంతా సిద్ధం చేస్తుండగా..బాలిక కళ్లు ఠక్కున తెరుచుకున్నాయి. గుండె మళ్లీ కొట్టుకుంటుంది..శరీరంలో కదలిక మొదలైంది. అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. బాలిక తండ్రి వెంటనే వైద్యులను తీసుకొచ్చాడు. వైద్యులు బాలికకు ఆక్సిజన్ అందించారు. అయితే దురదృష్టం ఏంటంటే..ఆ బాలిక ఓ గంట తర్వాత మళ్లీ చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

Leave a Comment