కొత్త ట్రెండ్.. ఎద్దులను కట్నంగా ఇచ్చారు..!

అమ్మాయి పెళ్లీడుకు వస్తే చాలు.. ఆమెకు మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అబ్బాయికి కట్నంగా లక్షల్లో నగదు, బైకులు, కార్లు ఇవ్వడం సాధారణం. ఇక అబ్బాయి ఉద్యోగస్తుడైతే ఇంకొంచెం ఎక్కువనే ఇస్తారు. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా వరుడికి ఎద్దులను కట్నంగా ఇచ్చారు. 

అదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామానికి చెందిన యువతిని అదిలాబాద్ మండలం ఛిచూధర్ ఖానాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. పెళ్లి వరుడి ఇంటి వద్ద జరిగింది. ఈ పెళ్లిలో వరుడికి అత్తింటివారు ఎడ్లను కట్నంగా ఇచ్చారు. దీన్ని చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. ఎడ్లను కట్నంగా ఇవ్వడంపై గ్రామంలో అందరూ చర్చించుకుంటున్నారు.  

Leave a Comment