పెళ్లయిన కొద్ద సేపటికే వధువు ఆత్మహత్య..

పెళ్లయిన కొద్ది సేపటికే నదిలో దూకి నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే..రాజస్థాన్ అలపుర్ కు చెందిన ఓ యువతికి ఆదివారం ఘనంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఉదయం బిదాయి వేడుకలు సంబరంగా జరిగాయి. ఇక ఆ పెళ్లి కూతురిని అత్తారింటికి సాగనంపారు. ఉదయం 7 గంటల సమయం..కారు మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లా చంబల్ నది వంతెనపై వెళ్తోంది..అంతలోనే తనకు వాంతి వస్తోంది..కారు ఆపాలని డ్రైవర్ ను కోరింది. అయితే ఆ డ్రైవర్ కు అనుమానం వచ్చి కారు ఆపలేదు. 

అంతలోనే ఆ నవవధువు స్టీరింగ్ ను గట్టిగా పట్టుకుని తిప్పేసింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేకులు వేశాడు. ఏమైందో అని పెళ్లికుమారుడు, అతడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వధువు కారులోంచి దిగి, వంతెనపై నుంచి నదిలో దూకేసింది. అంతే ఈ హఠాత్తు పరిణామంతో బంధువులు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment