కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ చివరి పోస్టు..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ తన చిట్టచివరి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ జూన్ 3న తన అమ్మ గురించి పెట్టాడు. తన అమ్మ 2002లోనే చనిపోయారు. 

‘మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో కలలు చిరున్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను’ అని ఎంతో ఆవేదనతో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు చూస్తే తన తల్లిపట్ల సుశాంత్ కి ఉన్న ప్రేమ స్పష్టంగా అర్థమవుతోంది.

పోస్టు మార్టం పూర్తి.. 

ఇదిలా ఉండగా సుశాంత్ బాడీకి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. అయితే శరీరంలో విషపూరితాలు ఉన్నాయో లేదో టెస్ట్ చేసేందుకు అవయవాలను జేజే ఆస్పత్రికి పంపించారు. అయితే పోస్టు మార్టంలో సుశాంత్ ది ఆత్మహత్యే అనే నిర్ధారించారు. సుశాంత్ బాడీకి కరోనా టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ అని వచ్చింది.  కాగా నేడు సుశాంత్ అంత్యక్రయలు జరపనున్నారు. 

అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. సుశాంత్ డిప్రెషన్ లో ఉండటమే కారణంగా పోలీసులు  ప్రాథమిక విచారణలో తేలింది. గత ఆరు నెలలుగా సుశాంత్ మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, అందుకే ఈ నిర్ణయం తీసకుని ఉండొచ్చని అతడి స్నేహితులు చెబుతున్నారు. 

 

Leave a Comment