అల్లు అర్జున్ కు సజ్జనార్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన రాపిడో యాడ్ ఈ వివాదానికి కారణమైంది. దీంతో ఈ యాడ్ పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అల్లు అర్జున్ కు లీగల్ నోటిసులు పంపించారు.. కఠిన చర్యలు తప్పవని అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చారు..ప్రస్తుతం బన్ని నటించిన ఈ యాడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

అల్లు అర్జున్ ఇటీవల ర్యాపిడో టూ వీలర్ ట్యాక్సీ సర్వీస్ కి సంబంధించి ఓ యాడ్ చేశారు. అయితే ఈ యాడ్ కొంచెం కాంట్రవర్సీకి లోనైంది. ఈ యాడ్ లో తెలంగాణ ఆర్బీసీని కించపరిచే విధంగా ఉంది. ఆర్బీసీ బస్సును దోసతో పోల్చి చూపారు. ర్యాపిడోలో వెళ్తే బాగా ఫాస్ట్ గా వెళ్తారు.. బస్సులో అయితే ఇబ్బందిగా అవుతుంది అన్నట్లు ఈ యాడ్ లో చూపించారు. 

ఈ యాడ్ పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తో పాటు ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను కించపరిచే యాడ్ ను వెంటనే నిలిపివేయాలని, ఆర్టీసీని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా క్షమించమని అన్నారు. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థలు స్పందించకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తమన్నారు.. ప్రముఖులు, హీరోలు ఏదైనా యాడ్ చేసే ముందు సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు.. కాగా లీగల్ నోటీసులకు అల్లు అర్జున్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి..

Leave a Comment