రూ.కోటి విలువైన స్థలాన్ని 150 మంది పేదలకు ఇచ్చేశారు.. మీరు సూపర్ సార్..!

సహాయం చేయడం అనేది ఒక గొప్ప గుణం.. గొప్ప మనసున్న వారు మాత్రమే పేదలకు సాయం చేయగలరు.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పెద్దాయన ఎంతో విలువైన స్థలాన్ని పేదలకు దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు..

జిల్లాలోని కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన విద్యావేత్త దేవసాని రామమనోహరరెడ్డి  మూడు దశాబ్దాల క్రితం గ్రామం వదిలి బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన తన సొంతూరుకు వచ్చిన ప్రతిసారి దానధర్మాలు చేస్తుంటారు. ఇటీవల తన ఇంటి దగ్గర రూ.కోటి విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని 150 మంది పేదలకు అందజేశారు. 

ఒక్కొక్కరికి 107 చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తూ దానపత్రాలను గ్రామ పెద్ద సమక్షంలో సోమవారం పంపిణీ చేశారు. జనవరి 18న మరో వంద మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇంకో మూడు ఎకరాల స్థలం సిద్ధం చేస్తున్నట్లు దాత మనోహరరెడ్డి తెలిపారు. రామ మనోహరరెడ్డి గొప్ప మనుసుతో చేస్తున్న సాయంపై ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు..   

Leave a Comment