సరిహద్దులో ఏపీ అంబులెన్స్ లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు..!

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషెంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కోవిడ్ పేషెంట్స్ తో వచ్చే ఏపీ అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. 

తెలంగాణ ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆస్పత్రి నుంచి అనుమతి ఉంటే అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్నారు. ఆస్పత్రి అనుమతి పత్రాలు తప్పనిసరిగా చూపించాలని పేర్కొంటున్నారు. అయితే సాధారణ ప్రయాణికులను మాత్రం అనుమతిస్తున్నారు..

Leave a Comment