పెళ్లయిన నెలకే భార్యను రూ.1.8 లక్షలకు అమ్మేసి.. స్మార్ట్ ఫోన్ కొన్నాడు.. షాకింగ్ స్టోరీ..!

ఓ 17 ఏళ్ల మైనర్ యువకుడికి, 26 ఏళ్ల యువతితో పెళ్లి చేశారు. పనుల కోసం ఆమెను వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాడు. అక్కడ భార్యను రూ.1.8 లక్షలకు అమ్మేసి స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు..  

వివరాల మేరకు.. ఒడిశాలోని బలంగీర్ జిల్లాలోని బెల్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ యువకుడు 26 ఏళ్ల యువతిని జూలైలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన నెలకు ఆగస్టులో మధ్యప్రదేశ్ సరిహద్దులోని రాజస్తాన్ బారన్ జిల్లాలో ఇటుకల బట్టీలో పనిచేసేందుకు వెళ్లారు. అక్కడ తన భార్యను బరన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి రూ.1.8 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బు మొత్తాన్ని ఖర్చు చేశాడు. తన కోసం ఓ మంచి స్మార్ట్ ఫోన్ కొన్నాడు. తర్వాత ఆ యువకుడు ఒడిశా తిరిగి వచ్చేశాడు. 

అయితే భార్య ఎక్కడ ఉందని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తన భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని ఆ యువకుడు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. తన భార్యను అమ్మి స్మార్ట్ ఫోన్ కొన్నట్లు చెప్పాడు. దీంతో అతి కష్టం మీద మహిళను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..17 ఏళ్ల యువకుడిని శుక్రవారం జువైనల్ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

  

 

Leave a Comment