ప్రేమ పెళ్లి.. తర్వాత అందంగా లేవని భర్త వేధింపులు.. మనస్తాపంతో ఉరేసుకుని..!

ప్రేమించానన్నాడు.. జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించాడు. తీరా పెళ్లి చేసుకున్నాకా.. అందంగా లేవని వేధించాడు.. భర్త వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది ఓ మహిళ.. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని జిన్గుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. జిన్గుర్తి గ్రామానికి చెందిన మహేష్, యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత(23) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

కొన్నాళ్లు వీరి జీవితం అన్యోన్యంగానే కొనసాగింది. ఆ తర్వాత తగాదాలు మొదలయ్యాయి. భార్యను అందంగా లేవని నిత్యం వేధించడం మొదలు పెట్టాడు మహేష్. సునీతను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు అధికమవ్వడంతో మనస్తాపం చెందిన సునీత గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త వేధింపులు తట్టుకోలేకనే తన చెల్లి ఆత్మహత్య చేసుకుందని సునీత సోదరి అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

Leave a Comment