ఠాగూర్ సీన్ రిపీట్.. శంషాబాద్ లో శవానికి వైద్యం చేసిన డాక్టర్లు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.. అందులో ఓ హాస్పిటల్ సీన్ ఉంటుంది. డబ్బు కోసం చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తారు వైద్యులు. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అచ్చం అలాంటి ఘటనే శంషాబాద్ లో జరిగింది. చనిపోయిన వ్యక్తికి హాస్పిటల్ సిబ్బంది వైద్యం చేసింది…  

వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా ఉమెన్ తాల గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి ఈనెల 16న పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేయడంతో బతుకుతాడేమోననే ఆశతో శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. 

అప్పుడే గేమ్ స్టార్ చేశారు వైద్యులు.. రెండురోజుల పాటు గుట్టుచప్పుడు కాకుండా వైద్యం అందించారు. చనిపోయిన తర్వాత కూడా డబ్బుల కోసం చికిత్స అందిస్తున్నట్లు నటించారు. రెండు లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసి.. తర్వాత మధు మృతి చెందాడని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మిగితా డబ్బులుకట్టి డెడ్ బాడీ తీసుకెళ్లాలని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో చనిపోయిన శవానికి వైద్యం చేశారంటూ మృతుని బంధవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.    

  

Leave a Comment