భారత్ – చైనా ఘర్షణలో సూర్యాపేట ఆర్మీ అధికారి మృతి..

లద్దాఖ్ లోని గాల్వాన్ వ్యాలీ వద్ద సరిహద్దుల్లో భారత సైన్యంపై చైనా ఆర్మీ ఘర్షణకు దిగింది. ఇరు సైన్యాల మధ్య జరిగిన దాడిలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు మరణించారు. ఇరు దేశాలలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్ లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.  

చనిపోయిన ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దుల్లో మరణించిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు సూర్యాపేటకు చెందిన వారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 

 

Leave a Comment