ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను తెలుగులో చదివారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లగా, రెవెన్యూ అంచనా రూ.1,80,393కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన వెల్లడించారు.
బడ్జెట్ లో ముఖ్యంశాలు ఇవే..
- వ్యవసాయానికి – రూ.11,891 కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసాకు – రూ.3,615
- ధరల స్థిరీకరణ నిధి – రూ.3 వేల కోట్లు
- వడ్డీ లేని రుణాల కోసం – రూ.1,100 కోట్లు
- మైనారిటీ సంక్షేమానికి – రూ.1,998 కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి – రూ.1,840 కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి – రూ.7,525 కోట్లు
- కాపుల సంక్షేమానికి – రూ.2,845 కోట్లు
- బీసీల సంక్షేమానికి – రూ.23,406 కోట్లు
- విద్యశాఖకు – రూ.22,604 కోట్లు
- వైద్య రంగానికి – రూ.11,419 కోట్లు
- ఆరోగ్యశ్రీకి – రూ.2100 కోట్లు
- వైఎస్సార్ గృహవసతికి – రూ.3వేల కోట్లు
- పీఎం అవాజ్ యోజన అర్బన్ కు – రూ.2540 కోట్లు
- పీఎం అవాజ్ యోజన్ గ్రామీణం – రూ.500 కోట్లు
- డ్వక్రా సంఘాలకు – రూ.975 కోట్లు
- రేషన్ బియ్యం – రూ.3వేల కోట్లు
- వైఎస్సార్ పెన్షన్ కానుక – రూ.16 వేల కోట్లు
- వైఎస్సార్ ఆసరా – రూ.6,300 కోట్లు
- అమ్మ ఒడి – రూ.6 వేల కోట్లు
- హోం శాఖకు – రూ.5,988 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్కు – రూ.425.93 కోట్లు
- 104, 108 వాహన సేవలకు – రూ.470.29 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి – రూ.16,710 కోట్లు
- రవాణా రంగానికి – రూ.6,588 కోట్లు
- సాగునీటి పారుదల శాఖకు – రూ.11,805 కోట్లు
- కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం – రూ. 500 కోట్లు
- ప్రతిభ స్కాలర్షిప్స్ కోసం – రూ. 10.54 కోట్లు
- నేషనల్ హార్టీకల్చర్ మిషన్ – రూ. 150.99 కోట్లు
- పట్టణ స్వయం సహాయక బృందాల కోసం – రూ. 389.89 కోట్లు
- నేషనల్ హెల్త్ మిషన్ కోసం – రూ. 1808.03 కోట్లు
- గ్రామ సచివాలయాల కోసం – రూ. 1633 కోట్లు
- అమరావతి-అనంతపురం నేషనల్ హైవే కోసం – రూ. 100 కోట్లు
- డ్రగ్స్, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం – రూ. 400 కోట్లు
- రైతులకు విత్తనాల పంపిణీ కోసం – రూ.200 కోట్లు
- జగనన్న విద్యాకానుక కోసం – రూ.500 కోట్లు
- ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కోసం – రూ. 55.15 కోట్లు
- రైతులకిచ్చే నష్ట పరిహారం కోసం – రూ. 20 కోట్లు
- కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం – రూ. 242.15 కోట్లు
- వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి – రూ. 100 కోట్లు
- అగ్రిగోల్డ్ బాధితులకు – రూ.200 కోట్లు