హత్యకు కుట్ర.. రూ.50 లక్షలు సుపారీ..

భూమా అఖిల ప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు తనను హతమర్చాలని చూస్తున్నారని, తనను చంపేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వారి అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో కలిసి తనను చంపేందుకు కుట్రపన్నారని చెప్పారు. వీరి కుట్రపై కడప పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి కుట్రను భగ్నం చేసి తనను కాపాడారని తెలిపారు. 

అనంతరం పోలీసుల విచారణలో నిందితులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భూమా అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బులు ఇచ్చాడని నిందుతులు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను చంపాలని చూస్తున్నారన్నారు. భూమా అఖిలప్రియ, భార్గవ రాముడిని వెంటనే అరెస్టు చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులను కోరారు. 

Leave a Comment