కుట్లు వేసి కడుపులో సూది మరిచిపోయారు..!

కడుపు నొప్పితో హాస్పిటల్ కు వెళ్లిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి సూది, దారం కడుపులోనే మరిచిపోయారు వైద్యులు.. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళకు మళ్లీ కడుపు నొప్పి రావడంతో స్కానింగ్ చేశారు. స్కానింగ్ లో సూది, దారం కనిపించడంతో వాారు షాక్ అయ్యారు. 

జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ కు చెందిన లచ్చవ్వకు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. దీంతో నాలుగు సంవత్సరాల క్రితం ఈమె సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్ గర్భసంచి ఆపరేషన్ చేశాడు. ఆ తర్వాత బాగానే ఉంది. అయితే కొన్నాళ్లకు ఆమెకు కడుపు నొప్పి మళ్లీ వచ్చింది. 

దీంతో ఇటీవల స్కానింగ్ చేయించకున్నారు. స్కానింగ్ రిపోర్టులో కడుపులో సూది, దారం ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసేందుకు ఉపయోగించిన సూది, దారం కడుపులోనే మరచిపోవడంతో ఈ కడుపునొప్పి వస్తున్నట్లు స్కానింగ్ చేసిన డాక్టర్ చెప్పాడు. అయితే అప్పుడామే ఆపరేషన్ చేయించుకున్న ఆస్పత్రి ఇప్పుడు మూతపడింది. ఆపరేషన్ చేసిన వైద్యుడు తనకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరు అవుతోంది. 

Leave a Comment