గ్రామ సచివాలయంలోనే 12 ఏళ్ల బాలికపై వాలంటీర్ అత్యాచారం..!

శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ దారుణానికి ఒడిగట్టాడు. గ్రామ సచివాలయంలోనే ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయలో పనిచేస్తున్న వాలంటీర్ హరిప్రసాద్ అక్టోబర్ 31న 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

సచివాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్న ఉద్యోగి రాంబాబు వాలంటీర్ కి సహకరించాడు. సచివాలయం బయట కాపలా ఉన్నాడు. లైంగిక దాడికి గురైన బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్లింది. కొద్దిసేపటికి తేరుకొని ఇంటికి వెళ్లింది. ఈ ఘటన జరిగిన రోజు బాధిత తల్లిదండ్రులు ఊరిలో లేరు. ఈనెల 3న తల్లిదండ్రుులు ఇంటికి తిరిగొచ్చాక విషయం తల్లిదండ్రులకు చెప్పింది ఆ బాలిక. దీంతో ఈనెల 3న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఈనెల 4న దిశ పోలీసులు గ్రామంలో వివరాలు సేకరించారు. బాలికపై లైంగిక దాడి చేసిన ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment