కరోనా లాక్ డౌన్ నుంచి సోనూసూద్ ఎంతో మందిని ఆదుకుంటున్నాడు. వరుస సాయాలు చేస్తూ ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు. కొందరు ఈ రియల్ హీరోకి గుడి కట్టి పూజిస్తున్నారు. దేశంలో పరిస్థితులను బట్టి వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నాడు. చాలా మంది సాయం కోసం సోనూసూద్ ను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి వైద్య సహాయం కూడా అందించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టాడు.
తాజాగా సోనూసూద్ మరోప్రాణాన్ని నిలబెట్టాడు. శుభమ్ అనే బాలుడికి కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స చేయించారు. ఈ సందర్భంగా ఆ బాలుడి కుటుంబ సభ్యులు సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘మీ మద్దతుతోనే శుభమ్ కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స పూర్తి అయింది. ఇప్పుడు శుభమ్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మీ సహాయానికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సోనూసూద్.. బిగ్ డే.. ఈ మధ్య కాలంలో చాలా క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స ఒకటి సూపర్ సక్సెస్. ఆ దేవుడికి ధన్యవాదాలు. అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.
Big Day.
One of our most complicated liver transplant and heart surgery in recent times is super succesful.
Thank you almighty ❣️🙏@ManishvarmaDr #apollohyd@SoodFoundation 🇮🇳 https://t.co/Tgy7spXlnh— sonu sood (@SonuSood) September 9, 2021