చికెన్, మటన్ కన్నా బీఫ్ ఎక్కవ తినండి.. బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

మేఘాలయ రాష్ట్ర పశుసంవర్ధక, బెటర్నరీ శాఖ మంత్రి సాన్ బర్ షులియా సంచలన వ్యాఖ్యలు చేశారు. చికెన్, మటన్, చేపల కంటే బీఫ్ ఎక్కువగా తినాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ ఆహారం తీసుకోవాలనే స్వేచ్ఛ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఉంటుందని మంత్రి సాన్ బర్ షులియా చెప్పారు.

 చికెన్, మటన్, చేపల కంటే బీఫ్ ఎక్కువగా తినాలని తాను సూచిస్తున్నానని, దీని వల్ల పశువధపై బీజేపీ నిషేధం విధించిందనే అపోహ కూడా తొలగిపోతుందని వ్యాఖ్యానించారు. బీఫ్ తినడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.. అయితే బీఫ్ తినాలంటూ బీజేపీ మంత్రి ప్రోత్సహిస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. 

ఇక మేఘాలయ, అసోం మధ్య ఉన్న సరిహద్దు అంశంపై ఆయన మాట్లాడుతూ సరిహద్దులను, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి షులియా పేర్కొన్నారు. అసోం ప్రజలు సరిహద్దుల్లో ఉన్న ప్రజలను వేధిస్తుంటే.. చర్చలకే పరిమితం కాకుండా, అవసరమైతే తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. హింసకుతాము వ్యతిరేకమని, ఎవరైనా మన ఇంటికి వచ్చి మనపై దాడి చేస్తే తిరగబడతామని, సరిహద్దుల విషయంలో కూడా అదే చేయాల్సి ఉందని చెప్పారు. 

 

Leave a Comment