మంత్రి కేటీఆర్ ని కలిసిన రియల్ హీరో సోనూసూద్..!

సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసోద్ మంగళవారం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. సోనూసూద్ పనిచేస్తున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్ని కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, సేవారంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను కేటీఆర్ తో పంచుకున్నారు.

తన తల్లి స్ఫూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సోనూసూద్ తెలిపారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ సోనూసూద్ కు లంచ్ ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు.. 

 

Leave a Comment