నిరుద్యోగులకు ఈ-రిక్షాలు ఇచ్చిన సోనూసూద్..!

కరోనా లాక్ డౌన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎంతో మంది పేదలను ఆదుకుంటూ దేవుడైపోయాడు. తాజాగా ఈ రియల్ హీరో మరోసారి పెద్ద మనుసును చాటుకున్నాడు. సోనూసూద్ స్వస్థలం పంజాబ్ లోని మోగా పట్టణంలో 8 మంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు అందజేశాడు. 

దేశ వ్యాప్తంగా 150 ఈ-రిక్షాలను పంచాలని నిర్ణయించుకున్నట్లు సోనూసూద్ తెలిపాడు. ఈ విధంగా చేయడంతో కొంత మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ అవసమైన వారికి తోచినంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైన వారికి తాను సాయం చూస్తూ అందరిలానే తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని సోనూసూద్ తెలిపాడు.   

 

Leave a Comment